న్యూఢిల్లీ, మార్చి 24: దేశంలో గోధుమల కొరత ఏర్పడుతున్నది. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే కేంద్రం వద్ద ఉన్న గోధుమల నిల్వలు ఏడేండ్ల కనిష్ఠానికి పడిపోయాయి. 2023 మార్చి 1 నాటికి కేంద్రం వద్ద నిల్వలు 11.67 మిలియన్ టన్నులు ఉండగా, ప్రస్తుతం 9.7 మిలియన్ టన్నులకు తగ్గాయి.
చివరగా 2017లో గోధుమల నిల్వలు 9.42 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. కనీస మద్దతు ధర ఇవ్వటంలో కేంద్రం విఫలం కావటం వల్లే రైతులు తమ పంటను ప్రైవేట్ వ్యాపారులకు అమ్మడంతో ప్రభుత్వ సేకరణ కోటా లక్ష్యం నెరవేరలేదని విశ్లేషకులు చెప్తున్నారు.