High Temperature | న్యూఢిల్లీ, జూన్ 21: వేసవి ముగిసి తొలకరి వర్షాలు మొదలయ్యాయంటే చాలు కుక్కల స్వైర విహారం, కుక్క కాట్లు అనే వార్తలు సర్వసాధారణమైపోతాయి. మరి ఈ సమయంలోనే కుక్కలు ఎక్కువగా మనుషులను ఎందుకు కరుస్తాయి? భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కుక్కల్లో ఉద్రేకం పెరుగుతుందని, దాంతో మనుషులపై దాడులు కూడా పెరుగుతాయని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు తేల్చారు. ఈ మేరకు సైంటిఫిక్ రిపోర్ట్ జర్నల్లో ప్రచురితమైన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.