పట్నా, మే 28: బీజేపీని వ్యతిరేకించే విపక్షాల సమావేశం జూన్ 12న జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం జరిగిన ఒక సమావేశంలో విపక్షాల ఐక్యతకు కృషి చేస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ మేరకు సంకేతాలిచ్చినట్టు జేడీయూ వర్గాలు తెలిపాయి.
పట్నాలో నిర్వహించనున్న ఈ సమావేశానికి ఏయే పార్టీలు హాజరవుతాయానే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.