Diabetes | న్యూఢిల్లీ, జూన్ 9: ఒకనాడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు నిలయంగా ఉన్న భారత్.. నేడు దీర్ఘకాలిక వ్యాధులకు కేంద్రంగా మారుతున్నది. డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ (బీపీ), కొలెస్టరాల్ తదితర వ్యాధులు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా దేశంలో డయాబెటిక్ విస్ఫోటం ప్రారంభమైందని ఐసీఎంఆర్ నిర్వహించిన సుదీర్ఘ సర్వేలో తేలింది. దేశంలో ప్రస్తుతం ఏకంగా 10.01 కోట్లమంది డయాబెటిక్ రోగులు ఉన్నట్టు ఆ సంస్థ తేల్చింది. ఇంతకంటే ఆందోళనకరమైన విషయం ఏంటంటే దేశంలో ప్రీ డయాబెటిక్ (త్వరలో డయాబెటిక్ వచ్చే అవకాశం అధికంగా ఉన్నవారు) రోగులు 15 కోట్లకు పైగా ఉన్నారని బ్రిటన్కు చెందిన లాన్సెట్ జర్నల్లో ప్రచురించిన పరిశోధన వ్యాసంలో ఐసీఎంఆర్ వెల్లడించింది.
1.కేరళ, 2.పుదుచ్చేరి, 3.తమిళనాడు, 4.కర్ణాటక, 5.ఆంధ్రప్రదేశ్, 6.తెలంగాణ, 7.గోవా, 8.మహారాష్ట్ర, 9.ఛత్తీస్గఢ్, 10.ఒడిశా, 11.మధ్యప్రదేశ్, 12.రాజస్థాన్, 13.గుజరాత్, 14.ఝార్ఖండ్, 15.పశ్చిమబెంగాల్, 16.హర్యానా, 17.పంజాబ్, 18.చండీఘర్, 19.హిమాచల్ప్రదేశ్, 20.ఉత్తరప్రదేశ్, 21.ఉత్తరాఖండ్, 22.ఢిల్లీ, 23.బీహార్, 24.మేఘాలయ, 25.త్రిపుర, 26.సిక్కిం, 27.అస్సాం, 28.మిజోరాం, 29.నాగాలాండ్, 30.మణిపూర్, 31.అరుణాచల్