Pran Pratishtha | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమానికి మరో 40 గంటలు మాత్రమే సమయం ఉంది. జనవరి 22వ తేదీ అంటే సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ నేపథ్యంలో రామ్ లల్లా విగ్రహ (Ram Lalla Idol) ప్రతిష్టకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇక ప్రాణ ప్రతిష్ట రోజున భక్తులకు పలు రకాల స్వీట్లను శ్రీరాముడి ప్రసాదంగా (prasad) అందించనున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన తెప్లా (చపాతీలు) (Thepla), ఆల్మండ్ స్వీట్స్, మటర్ కచోరీ (matar kachori ) సహా పలు రకాల స్వీట్స్ను ప్రారంభోత్సవం రోజున భక్తులకు ప్రసాదంగా అందించనున్నారు.
మరోవైపు ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఓ భక్తుడు భారీ లడ్డూను అయోధ్యకు పంపించారు. సిటీలోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఓనర్ ఎన్ నాగభూషణం రెడ్డి తయారు చేసిన భారీ లడ్డూ(Laddoo) ఇవాళ తెల్లవారుజామున అయోధ్యకు చేరుకుంది. సుమారు 1265 కేజీల బరువు ఉన్న ఆ లడ్డూ కరసేవక్పురంకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయం నుంచి కూడా లక్ష లడ్డూలను అయోధ్యకు చేరాయి. రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానంలో అయోధ్యకు ఒక లక్ష లడ్డూలను పంపించినట్లు తితిదే అధికారులు తెలిపారు.
Also Read..
Amazon | రామ మందిరం పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాలు.. అమెజాన్కు కేంద్రం నోటీసులు
Worlds largest lock | అయోధ్య చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం