Pran Pratishtha | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో రామ్ లల్లా విగ్రహ (Ram Lalla Idol) ప్రాణ ప్రతిష్ట (Pran Pratishtha) కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో భారత్ మొత్తం శ్రీరాముడి నామంతో మార్మోగిపోతోంది. ప్రజలు రామ భక్తిలో పరవశించిపోతున్నారు.
శ్రీరాముడి కీర్తనలు, భజన పాటలతో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మహారాష్ట్రలోని నాగ్పూర్ (Nagpur, Maharashtra)కు చెందిన ఓ పాఠశాల విద్యార్థులు రాముడిపై తమకున్న భక్తిని వినూత్న రీతిలో చాటుకున్నారు. ఉదయాన్నే ప్రార్థన సమయంలో తమ టీచర్తో కలిసి రాముడి భజన పాటకు డ్యాన్స్ చేశారు (School students dance) . పాఠశాలలోనే లైన్లో నిలబడి వారు డ్యాన్స్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#WATCH | Nagpur, Maharashtra: School students dance on Shri Ram bhajans ahead of the Shri Ram Janmabhoomi Temple Pran Pratishtha ceremony. pic.twitter.com/nMmAX718fl
— ANI (@ANI) January 20, 2024
Also Read..
Worlds largest lock | అయోధ్య చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం
Amazon | రామ మందిరం పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాలు.. అమెజాన్కు కేంద్రం నోటీసులు
Sweet Ber Fruit | అయోధ్యకు ఛత్తీస్గఢ్ భక్తులు.. రామయ్యకు నైవేద్యంగా రేగిపండ్లు