న్యూఢిల్లీ : అవసరం ఏ పని అయినా చేయిస్తుంది అంటారు! ఆర్థిక ఇబ్బందులు తప్పుడు మార్గంలో నడిపిస్తాయనే దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల మహ్మద్ అసద్ అనే ఓ వ్యక్తి జీవితం. అక్కాచెల్లెళ్లకు పెండ్లి కోసం దొంగతనాలు చేసే గ్రూపులో చేరాడు. ఈ క్రమంలో ఎదురయ్యే భయంకరమైన పరిస్థితులపై ఆలోచన చేయలేదు.
జూలై 31న ఓ చోరీ ఘటనలో మరో ఇద్దరితో పాటు మహ్మద్ అసద్ కూడా పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణ సమయంలో తాను దొంగగా ఎందుకు మారాల్సి వచ్చిందో పోలీసులకు వివరించాడు.