పీర్జాదిగూడ : పీర్జాదిగూడ నగరపాలక సంస్థను అభివృద్ధిలో ముందుంచేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి పీర్జాదిగూడ నగరపాలక కార్యాలయాన్ని సందర్శించి సంస్థ అభివృద్ధికి కేటాయించిన 2021-22 బడ్జెట్ ప్రణాళిక డ్రాప్ట్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రణాళిక కేటాయింపులో అభివృద్ధి పనులు ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను అదేశించారు. కార్యక్రమంలో నగరపాలక మేయర్ జక్క వెంకట్రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్, కమిషనర్ ఎం.శ్రీనివాస్, డీఈ శ్రీనివాస్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.