డెహ్రాడూన్: కేదార్నాథ్ దేవాలయం గర్భగుడిలో బంగారు తాపడం పనిలో రూ.125 కోట్ల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించింది. దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించింది.
ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలంటూ సాంస్కృతిక శాఖ కార్యదర్శిని ఆదేశించినట్టు మంత్రి సత్పల్ మహారాజ్ తెలిపారు. కేదార్నాథ్ ఆలయంలోని గర్భగుడిలో గోడలకు బంగారు తాపడం చేయించే క్రమంలో బంగారానికి బదులు ఇత్తడిని వాడి పెద్దమొత్తంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.