లక్నో, ఫిబ్రవరి 24: పేపర్ లీకేజీ ఆరోపణల నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం రద్దు చేసింది. ఆరు నెలల్లోగా తిరిగి నియామక పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. పేపర్ లీక్ ఆరోపణలపై దర్యాప్తునకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ను(ఎస్టీఎఫ్) ఏర్పాటు చేసింది.
ఈనెల 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కానిస్టేబుల్ నియామక పరీక్షకు 48 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రద్దును సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ పోస్టు ద్వారా వెల్లడించారు.పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన కేసులో పోలీసులు 240 మందికి పైగా అరెస్టు చేశారు.