న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశంలో గురువారం 12,591 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారంతో పోలిస్తే గురువారం కేసుల సంఖ్యలో 2 వేల పెరుగుదల కనిపించింది. దీంతో దేశంలోని మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 65,286 (0.14 శాతం)గా నమోదైంది.
కొవిడ్ కారణంగా గురువారం ఢిల్లీలో ఆరుగురు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో నలుగురు చొప్పున మృతి చెందారు.