న్యూఢిల్లీ: ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున యువత తమకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేయడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇది విదేశీ సంస్కృతి అని, 14న వాలెంటైన్స్ డేకు బదులుగా కౌ హగ్ డేగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన జంతు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది.
ఆ రోజున గోవులను ఆలింగనం చేసుకోవాలని సూచించింది. దీంతో పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందడమే కాక, ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుతుందని పేర్కొంది. గోవులు భారత సంస్కృతి, గ్రామీణ ఆర్థికానికి వెన్నెముక అని, వాటిని గోమాత అని పిలుస్తారని వివరించింది.