న్యూఢిల్లీ: ఆరెంజ్ ఎకానమీ (సృజనాత్మకత ఆధారిత ఆర్థిక వ్యవస్థ)కు కేంద్ర బడ్జెట్ ప్రోత్సాహం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 15,000 ప్రాథమికోన్నత పాఠశాలలు, 500 కళాశాలల్లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవీజీసీ), కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ను ఏర్పాటు చేయడానికి ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్కు సహకరిస్తామని నిర్మల తెలిపారు.
ఈ రంగంలో 2030 నాటికి 20 లక్షల ప్రొఫెషనల్స్ అవసరమవుతారన్నారు. దేశంలోని ప్రధాన పారిశ్రామిక లాజిస్టిక్స్ కేంద్రాల సమీపంలో ఐదు యూనివర్సిటీ టౌన్షిప్లను ఏర్పాటుచేస్తామనారు.