కోల్కతా, అక్టోబర్ 5: ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఇటీవల రెండు రోజులు ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ నాయకులు తాజాగా కోల్కతాలోని గవర్నర్ నివాసం రాజ్భవన్ ముట్టిడి కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని రవీంద్ర సదన్ నుంచి దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలోని రాజ్భవన్కు ర్యాలీగా బయలుదేరారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కీలక నేత అభిషేక్ బెనర్జీ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉపాధి నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.