అయోధ్య, డిసెంబర్ 15: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఓ పక్క రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుని జనవరిలో ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమవుతుండగా, మరో పక్క అయోధ్యలో వచ్చే ఏడాది మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరుగనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పవిత్ర మక్కా మసీదుకు చెందిన ఇమామ్ దీనికి శంకుస్థాపన చేస్తారు.
2019లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మసీదుకు భూమిని కేటాయించింది. దేశంలోనే అతి పెద్ద మసీదును ఇక్కడ నిర్మిస్తామని, 21 అడుగుల ఎత్తు, 36 అడుగుల వెడల్పున ప్రపంచంలోనే అతి పెద్ద ఖురాన్ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్టు మహ్మద్ బిన్ అబ్దుల్లా మసీదు అభివృద్ధి కమిటీ చైర్మన్, బీజేపీ నేత హాజీ అరాఫత్ షేక్ తెలిపారు.