న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ జన్ సురాజ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టి వేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.
విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, మీరేమో న్యాయ వ్యవస్థను వేదికగా చేసుకొని ప్రచారం పొందాలని చూస్తున్నారు’ అని అన్నారు. జన్ సురాజ్ సమస్య దేశ వ్యాప్త సమస్య కాదని.. కాబట్టి పాట్నా హైకోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవాలని కోర్టు సూచించింది.