Supreme Court | న్యూఢిల్లీ, జూలై 20: చైర్పర్సన్ లేకుండా ఢిల్లీ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ ఏమైపోయినా పరవాలేదా? మీకు చేతకాకపోతే చెప్పండి..మేమే నియమిస్తామంటూ సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తామే కమిషన్కు తాత్కాలిక చైర్పర్సన్ను నియమిస్తామని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది.
డీఈఆర్సీ విషయంలో ఆప్ దాఖలుచేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. చైర్పర్సన్ ఎంపికపై ఎల్జీ వీకే సక్సేనా, సీఎం కేజ్రీవాల్ మధ్య సమావేశం జరిగినప్పటికీ, వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం రాలేదు. దీనిపై ఆప్ తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది.