న్యూఢిల్లీ: ఈడీ పదవీ కాలం పొడిగింపుపై దాఖలైన పిటిషన్లు రాజకీయాలకు సంబంధించినవి కావని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా విడతలవారీగా ఈడీ డైరెక్టర్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం సోమవారం విచారించింది. ఇవి రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్లు అన్న సొలిసిటర్ జనరల్ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది.