న్యూఢిల్లీ: వీలునామా రిజిస్ట్రేషన్ కానంత మాత్రాన అది అనుమానాస్పదమని భావించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 1983లో బీ షీనా నాయర్ అనే వ్యక్తి తన వీలునామా రాశారు. తన ఆస్తులను తన సోదరి లక్ష్మీ నాయర్కి రాసిచ్చాడు.
దీనిని సవాల్ చేస్తూ ఆయన భార్య, పిల్లలు కోర్టు ను ఆశ్రయించారు. వీలునామా ఫోర్జరీ చేశారని, రిజిస్ట్రేషన్ కూడా కాలేదని వారు వాదించారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ‘వీలునామా నమోదు చేయాలనే నిబంధన చట్టంలో లేదు. కేవలం నమో దు కాలేదనే కారణంతో దానిని అనుమానించడం అహేతుకం’ అని పేర్కొంది.