బెంగళూరు, ఫిబ్రవరి 23: కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆలయాలపై పది శాతం పన్ను విధించేలా రూపొందించిన బిల్లు శుక్రవారం శాసనమండలిలో వీగిపోయింది. ఇదే బిల్లు రెండు రోజుల ముందు శాసనసభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నదన్న ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలు కర్ణాటకలో దుమారం రేపాయి. శాసనసభలో కాంగ్రెస్కు బలముంటే.. శాసన మండలిలో బీజేపీకి సంఖ్యా బలం ఎక్కువ.