హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న శరత్చంద్రారెడ్డికి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది.
తన భార్య ఆరోగ్యం సరిగా లేదని, కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఆమె చికిత్స తీసుకోవాల్సి ఉందని, అందుకు ఆరు వారాలపాటు బెయిల్ ఇవ్వాలని శరత్చంద్రారెడ్డి న్యాయస్థానాన్ని కోరారు. మానవతా కోణంలో నాలుగువారాల మధ్యంతర బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో అరెస్టయిన శరత్చంద్రారెడ్డి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.