షిల్లాంగ్ : (Venkaiah Naidu) దేశాభివృద్ధిలో అనుసంధానత పాత్ర అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. ముఖ్యంగా ఈశాన్య భారతం వంటి ప్రాంతాల అభివృద్ధిలో మెరుగైన రహదారి వ్యవస్థ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందన్నారు. మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేసే పని మరింత వేగవంతం కావలసి ఉందని ఆకాంక్షించారు.
ఈశాన్య భారతదేశ పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు సోమవారం ఉదయం షిల్లాంగ్ చేరుకున్నారు. షిల్లాంగ్లో ఆయన షిల్లాంగ్-డౌకీ మార్గం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడి రహదారి అనుసంధాన సంక్లిష్టతల గురించి వివరిస్తూ మాట్లాడారు. ఈశాన్య భారతంలోని కొండ ప్రాంతాలు, వర్షపు నేలలు రహదారి కార్యకలాపాలకు తరచూ ఆటంకం కలిగిస్తూ ఉంటాయని, ఈ నేపథ్యంలో రోడ్ల నిర్మాణంలో నూతన ఆవిష్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. మేఘాలయ వంటి రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో యువత ముందుకు రావలసిన అవసరాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. మేఘాలయలో ఉద్యానవన సాగులో ప్రైమ్ హబ్ ద్వారా మేఘాలయ ప్రభుత్వం చొరవను అభినందించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇది ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా, ఉప ముఖ్యమంత్రి పీ టిన్సాంగ్ తోపాటు మేఘాలయకు చెందిన పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు ఆయన రాజ్భవన్లో పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఉదయం గౌహతి నుంచి షిల్లాంగ్ బయలుదేరిన ఆయన.. మార్గమధ్యంలో ఉమియం సరస్సు కాస్సేపు నిలిచి ప్రకృతిని ఆస్వాదించారు. మరో ఆరు రోజుల పాటు వెంకయ్యనాయుడు ఈశాన్య భారతదేశం పర్యటనలో ఉంటారు.
70 శాతం వయోజనులకు అందిన తొలి డోసు : మాండవీయ
ఉత్తరప్రదేశ్ ‘నయా జమ్ముకశ్మీర్’ : ఓమర్ అబ్దుల్లా
ఐక్యరాజ్య సమితిలో వాజపేయి హిందీ ప్రసంగం
ఈ గాజు మహా బలమైనది.. ఫోన్ స్క్రీన్లుగా వస్తే పగిలే సమస్య ఉండదంట!
ఊబకాయానికి ఇది మరో కారణం.. గుర్తించిన శాస్త్రవేత్తలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..