RBI | ముంబై, మే 20: రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి, ఇతర నోట్లతో మార్పిడి చేయడానికి బ్యాంక్లు నిరాకరిస్తే ఖాతాదారులు ఏమి చేయాలో రిజర్వ్బ్యాంక్ వివరణ ఇచ్చింది. సర్క్యులేషన్ నుంచి తొలగిస్తున్నామని, ఖాతాదారులు వారివద్దనున్న నోట్లను బ్యాంక్ శాఖల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, లేదా మార్చుకోవచ్చని రిజర్వ్బ్యాంక్ ప్రకటించిన నేపథ్యంలో తలెత్తే సందేహాలకు సమాధానాలిచ్చింది.
రద్దుచేసిన కరెన్సీని డిపాజిట్గా తీసుకునేందుకు లేదా మార్చుకునేందుకు బ్యాంక్ శాఖ నిరాకరిస్తే ఖాతాదారు తొలుత సంబంధిత బ్యాంక్ను సంప్రదించాలి. ఫిర్యాదు చేసిన తర్వాత 30 రోజుల్లోగా బ్యాంక్ స్పందన/పరిష్కారం సంతృప్తికరంగా లేకపోతే రిజర్వ్బ్యాంక్-ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ కింద ఆర్బీఐ పోర్టల్లోని కంప్లయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంక్లు, ఆర్థిక సంస్థల సేవలకు సంబంధించి ఖాతాదారుల వివాదాల్ని పరిష్కరించడానికే ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ ఉద్దేశించారు.
రూ.2000 నోట్లను డిపాజిట్ చేయడానికి, మార్చుకోవడానికి ఆర్బీఐ 2023 మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకూ గడువు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా బ్యాంక్ల్లో ఖాతాలు లేనివారు కూడా ఏ బ్యాంక్ శాఖల్లోనైనా రూ.20,000 పరిమితివరకూ రూ.2000 నోట్లను మార్పిడి చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.