న్యూఢిల్లీ: ‘ఫేస్బుక్ వ్యసనం వినియోగదారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నదని ఆ కంపెనీ అంతర్గత నివేదిక పత్రాల ఆధారంగా ప్రఖ్యాత మీడియా వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ‘పనితోపాటు స్నేహ, కుటుంబ బంధాలను ఫేస్బుక్ దెబ్బతీస్తున్నది. పిల్లల పెంపకంపై తల్లిదండ్రులను సైతం ప్రభావితం చేస్తున్నది. ఫేక్బుక్ మొత్తంగా 12.5 శాతం మంది (సుమారు 36 కోట్ల) వినియోగదారులపై చెడు ప్రభావం చూపుతున్నదని తెలిపింది. అయితే ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా ఈ నివేదికను ఖండించింది.