న్యూఢిల్లీ: ఉపాధి హామీ కూలీలు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరసన శనివారంతో 30వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించాలనుకున్న విద్యార్థుల సదస్సును పోలీసులు భగ్నం చేశారు. ముందస్తు అనుమతి తీసుకున్నా.. కార్యక్రమం ప్రారంభం కాగానే రంగప్రవేశం చేసిన పోలీసులు అడ్డుకున్నారు.
ఉపాధి హామీ కూలీల సమస్యలపై జంతర్మంతర్కు ఆవల జరిగే ఎలాంటి కార్యక్రమానికీ తాము అనుమతించమని, విద్యార్థులు ముం దుగా తీసుకున్న పర్మిషన్ను రద్దు చేస్తున్నామని తెగేసి చెప్పారు.