అహ్మదాబాద్, మే 29: గుజరాత్లోని అహ్మదాబాద్లో నాణ్యత లేని ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన కేసులో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను సెషన్స్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తిరస్కరించడంతో ఆదివారం రాత్రి లొంగిపోయారు. ఖొఖరా పోలీసుస్టేషన్ పరిధిలోని హత్కేశ్వర్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి నాసిరకం మెటీరియల్ వాడారనే ఆరోపణలు ఉన్నాయి.
ఐదేండ్ల క్రితం నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ప్రస్తుతం ప్రజలకు ప్రమాదకరంగా మారింది. దీంతో దీన్ని కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. 2017లో ప్రారంభించిన ఈ వంతెన.. దెబ్బతినడం వలన కేవలం 4-5 ఏండ్లలోనే మూసివేశారు. ైనిర్మాణంలో నాణత్య లేని కాంక్రీట్, సిమెంట్ వాడారని స్వతంత్ర సంస్థల దర్యాప్తులో తేలిందని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) గుజరాత్ హైకోర్టుకు తెలిపింది.