న్యూఢిల్లీ, మార్చి 19: ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సిందే. అయితే ఇప్పటి వరకు ఎంతమంది అభ్యర్థులు తమ డిపాజిట్ కోల్పోయారో తెలుసా? ఎన్నికల సంఘం వద్ద ఉన్న డాటా ప్రకారం.. 1951 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా సుమారు 71 వేల మంది లోక్సభకు పోటీ చేసిన అభ్యర్థులు సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 91,160 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 71,246 మంది (78 శాతం) ధరావతు గల్లంతైంది.
గెలిచిన అభ్యర్థిలో ఆరో వంతు ఓట్లు పడితేనే ఓడిన అభ్యర్థికి కట్టిన డిపాజిట్ వాపస్ ఇస్తారు. ఆరో వంతు ఓట్లు పడకపోతే సొమ్ము పోయినట్టే లెక్క. ఆ సొమ్మును ట్రెజరీకి జమ చేస్తారు. 2019 ఎన్నికల్లో 86 శాతం మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. తొలి లోక్సభ (1951-52)లో 1,874 మంది బరిలో నిలవగా 745 మంది(40 శాతం)కి డిపాజిట్ దక్కలేదు. ప్రతి సారి డిపాజిట్ దక్కని వారి సంఖ్య పెరుగుతూ పోతున్నది.