పాట్నా: ఆయోధ్యలోని రామమందిరానికి పోటీగా తాము బీహార్లో సీతా మందిరాన్ని నిర్మించి హిందువుల మనసు దోచుకోవాలని నితీశ్ కుమార్ ప్రభుత్వం నిర్ణయించింది. సీతాదేవి జన్మించినట్టుగా చెబుతున్న సీతామర్హి జిల్లాలోని పునారా ధామ్ను పెద్దయెత్తున అభివృద్ధి చేయడానికి నిధులు కేటాయించింది.
ఈ ప్రాంతాన్ని 72.47 కోట్లతో పునర్నిర్మించి అందంగా తీర్చిదిద్ది దేశ వ్యాప్తంగా మరింతమందిని ఆకర్షించడానికి నితీశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీతాదేవి జన్మ స్థలాన్ని అభివృద్ధి చేయడాన్ని సమర్థించుకున్న నితీశ్ ప్రభుత్వం తాము కేవలం హిందువులకే కాక సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నట్టు తెలిపింది.