న్యూఢిల్లీ : పాత యజమాని బకాయి పడ్డ విద్యుత్తు బిల్లులను కొత్త యజమాని లేదా వేలంలో ఆ ప్రాంగణాన్ని కొన్న వారి నుంచి విద్యుత్తు సరఫరా సంస్థలు వసూలు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత యజమాని పెట్టిన బకాయిల కారణంగా తమకు విద్యుత్తు సరఫరా చేయడం లేదని కేరళకు చెందిన కేసీ నినన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. విద్యుత్తు సరఫరా చట్టం – 1948లోని సెక్షన్ 49 ప్రకారం పాత విద్యుత్తు బకాయిలను కొత్త యజమాని చెల్లించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది.