ముంబై: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ ప్రకటనను ఎన్డీయే పేరు మీద విడుదల చేయడం చూస్తుంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలవడంపై బీజేపీకి నమ్మకం లేనట్టు కనిపిస్తున్నదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) విమర్శించింది.
కర్ణాటక ఎన్నికల తర్వాత పార్టీ బలహీనపడుతున్నట్టు బీజేపీ భావిస్తున్నదని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లిడే క్రాస్టో అన్నారు. ఓటమి నుంచి తప్పించుకొనేందుకు కూటమిని ఊతకర్రగా వాడుకోవడానికే బీజేపీ ఇప్పుడు ఎన్డీయేకు ప్రాధాన్యమిస్తున్నదాఅని ఆయన ప్రశ్నించారు.