న్యూఢిల్లీ: ఆర్థిక మోసాల నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకున్నది. ఈ కేసులో తాను అప్రూవర్గా మారతానని నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఈ విషయపై ఈడీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోర్టు ఆమెకు సూచించింది.
పాటియాలా హౌస్ కోర్ట్ శుక్రవారం ఈ మేరకు ఈ విషయమై ఈడీకి నోటీస్ జారీ చేసి తదుపరి విచారణను ఈ నెల 20న చేపడతామని పేర్కొన్నది. ఈ కేసులో జాక్వెలిన్పై క్రిమినల్ ప్రొసీడింగ్స్ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన కొన్ని నెలల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకున్నది.