ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, కేంద్ర బడ్జెట్ (Union Budget 2024) పై స్పందించారు. మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిందని విమర్శించారు. అలాగే దేశంలో పేదలు, మహిళలు, యువత, రైతులు ఉన్నారని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు గ్రహించిందని ఎద్దేవా చేశారు. ‘మోదీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్ను సమర్పించింది. ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఆమె చాలా భారమైన హృదయంతో చివరి బడ్జెట్ను సమర్పించారు’ అని అన్నారు.
కాగా, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా కేంద్ర బడ్జెట్పై మాట్లాడారు. మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న సూక్తులు, పనుల మధ్య చాలా తేడా ఉందని తెలిపారు. ‘చెప్పడానికి, చేయడానికి చాలా తేడా ఉంది. గత పదేళ్లుగా మనం చూస్తున్నది ఇదే. పేదలు, మహిళలు, యువతకు ఇందులో ఏమీ లేదు. సాధారణ ప్రజానీకం ఆశలపై నీళ్లు చల్లారు’ అని అన్నారు.
#WATCH | On the interim budget, Shiv Sena (UBT) MP Priyanka Chaturvedi says, “There is a huge difference between saying and doing, this is what we have been seeing for the last 10 years… There is nothing in it for the poor, women and youth. This budget has poured cold water on… pic.twitter.com/oR8GoKSuFN
— ANI (@ANI) February 1, 2024