జమ్ము : వచ్చే నెల 1 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆహార పదార్థాలకు సంబంధించి ఆ ఆలయ యాజమాన్యం సూచనలు చేసింది. దాదాపు 40 ఆహార పదార్థాలను యాత్రికులు తమ వెంట తెచ్చుకోవద్దని సూచించింది.
అందులో పూరీ, పిజ్జా, బర్గర్, దోశ, ఫ్రైడ్ రోటి, బ్రెడ్ విత్ బట్టర్, క్రీంతో కూడుకున్న ఆహార పదార్థాలు, పచ్చళ్లు, ఫాస్ట్ఫుడ్, కూల్డ్రింక్స్ తదితరాలు ఉన్నాయి. యాత్ర సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే భక్తులు ఇంటి వద్ద నడకను ప్రాక్టీస్ చేయాలని సూచించింది.