ముంబై: ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్పై మహారాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందని ఉద్యమకారుడు మనోజ్ జరాంగే గురువారం ఆరోపించారు.
ఛత్రపతి శంభాజీ నగర్లోని ఓ దవాఖానలో గురువారం విలేకర్లతో మాట్లాడుతూ.. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఈ నెల 17న సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 24లోగా మరాఠాలకు రిజర్వేషన్లను కల్పించాలని ఆయన గతంలో ప్రభుత్వానికి గడువు విధించారు.