Dress Code | ముంబై : ఉపాధ్యాయులకు డ్రెస్కోడ్ను విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని, ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టు, డిజైనర్, ప్రింటెడ్ దుస్తులు ధరించి సూలుకు రాకూడదని షరతులు విధించింది.
మహిళా ఉపాధ్యాయులు జీన్స్, టీ-షర్టులు, ముదురు రంగులు, డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. వారు కుర్తా దుపట్టా, సల్వార్, చుడీదార్, లేదా చీర ధరించాలని మహా సర్కా ర్ తెలిపింది. ఈ నిబంధనలు ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయి.