బెంగళూరు, డిసెంబర్ 16: ఏదైనా కేసు విషయంలో పాస్పోర్టును సీజ్ లేదా స్వాధీనం చేసుకునే అధికారాలు పోలీసులు, క్రిమినల్ కోర్టులకు లేవని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని సెక్షన్-102, 104 కింద ఏవైనా పత్రాల్ని స్వాధీనం చేసుకోవచ్చునని, పాస్పోర్ట్కు ఇది వర్తించదని హైకోర్టు తేల్చిచెప్పింది.
వ్యాపారవేత్త శంభుకుమార్ కాసిల్వాల్ తన పాస్పోర్ట్ను స్వాధీనం చేయాలంటూ ‘డెట్ రికవరీ ట్రిబ్యునల్-1’ (డీఆర్టీ) ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు కొట్టేసింది. అతడి పాస్పోర్ట్ను వెంటనే విడుదల చేయాలని డీఆర్టీని ఆదేశించింది. రుణాన్ని చెల్లించటంలోవిఫలం కావటంతో 2015లో బ్యాంకులు శంభుకుమార్కు వ్యతిరేకంగా డీఆర్టీలో కేసు వేశాయి.