బెంగళూరు, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడి ఎంపికను పార్టీ జాతీయాధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ కాంగ్రెస్ శాసన సభా పక్షం(సీఎల్పీ) ఆదివారం ఏక వాక్య తీర్మానం చేసింది. ‘సీఎల్పీ సమావేశ నివేదికను అధిష్ఠానానికి అందజేస్తాం. అధిష్ఠానం కొంత సమయం తీసుకొని సీఎం పేరు ప్రకటిస్తుంది’ అని అంతకుముందు ఖర్గే మీడియాకు తెలిపారు.
సీఎల్పీ సమావేశం జరిగిన హోటల్లో పరిశీలకులు సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్ధు, డీకే మద్దతుదారుల మధ్య పోస్టర్ వార్ నడిచింది.