బెంగళూరు : గగన్యాన్లో అత్యంత కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ను పరీక్షించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు చేస్తున్నది. మన దేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీహరికోట నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది.
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ మాట్లాడుతూ, దీనికి సంబంధించిన అన్ని వెహికిల్ సిస్టమ్స్ శ్రీహరికోటకు చేరుకున్నాయని, ఫైనల్ అసెంబ్లింగ్ జరుగుతున్నదని, ఈ నెలాఖరులో దీనిని ప్రయోగిస్తామని చెప్పారు. దీన్ని రోదసీ పర్యాటకంతోపాటు అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చునన్నారు.