న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్పూర్ నుంచి ముంబైకి ఏప్రిల్ 23న ఓ విమానం వెళ్తున్నది. అందులో ఓ ప్రయాణికురాలిని తేలు కుట్టింది. దీంతో ముంబైకి చేరగానే దవాఖానకు తరలించి చికిత్స అందించారు.
అనంతరం విమానంలో తనిఖీలు చేసి ఫ్యూమిగేషన్ ప్రక్రియ నిర్వహించారు. సామగ్రి ద్వారా తేలు ప్రవేశించి ఉండొచ్చని, తగిన చర్యలు చేపట్టాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.