ప్రచారం: పై ఫొటోలో ఉన్న మొదటి వ్యక్తి ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. గతంలో ఆయన ఆటో నడిపారు. ఇక రెండో వ్యక్తి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. గతంలో ఆమె దినసరి కూలీగా పనిచేశారు. ఇక మూడో వ్యక్తి ప్రధాని మోదీ. గతంలో ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా ఆఫీసు నేలను చీపురుతో ఊడ్చారు. ఇప్పుడు వాళ్లు గొప్ప పదవుల్లో కొనసాగుతున్నారు.
వాస్తవం: ఈ ఫొటో ప్రామాణికతను క్వింట్ పరిశీలించింది. పై ఫోటో ఫేక్ అని తేల్చింది. ఫొటోలో ఉన్న మొదటి వ్యక్తి షిండే కాదని, మహారాష్ట్ర రిక్షా పంచాయత్ అధ్యక్షుడు బాబా కుంబ్లే అని వెల్లడించింది. ముర్ముగా చెబుతున్న మహిళ ఒడిశాకు చెందిన సుకుమార్ తుడుగా తెలిపింది. ఇక ఫొటోలో ఉన్న మూడో వ్యక్తి మోదీనే అయినప్పటికీ, ఆయన చీపురు పట్టుకొని ఊడుస్తున్న ఆ ఫొటో మార్ఫింగ్ అని, అసలు ఫొటోను విడుదల చేసింది. ఆ ఫొటోలో మరో వ్యక్తి ఉండటాన్ని గమనించవచ్చు.