హైదరాబాద్లో భారీ వర్షం పడి కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిస్తే బీజేపీ నేతలు ప్రభుత్వంపై సోషల్మీడియాలో చేసే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం వర్షాలకు రెండురోజులుగా బెంగళూరు మునిగిపోయే ఉన్నది. ఉద్యోగులు ఇలా జేసీబీలు, ట్రాక్టర్లలో ఆఫీసులకు వెళ్తున్నారు. అక్కడ బీజేపీయే అధికారంలో ఉన్నది. బెంగళూరులో జలవిలయం గత ప్రభుత్వాల తప్పిదాల ఫలితమేనంటూ సీఎం బొమ్మై నెపం కాంగ్రెస్పై నెట్టేశారు. వాళ్లు అధికారంలో ఉన్నచోట జరిగితే.. అది గత ప్రభుత్వాల తప్పిదం. విపక్షంలో ఉన్నచోట జరిగితే.. అది ప్రభుత్వ వైఫల్యం. ఇదీ బీజేపీ నీతి.
ఫొటోలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ఉన్నది దేశాధినేతో, రాజకీయ ప్రముఖుడో కాదు.. ఆయన ఒక వ్యాపారి. పేరు గౌతమ్ అదానీ. భారత పర్యటనకు వచ్చిన హసీనాతో ఢిల్లీలో ప్రధాని మోదీ తదితరుల తర్వాత భేటీ అయిన ఏకైక వ్యక్తి ఈయనే. గత ఏప్రిల్లో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు కూడా ప్రధాని తర్వాత ఆయనను కలిసే అవకాశం దక్కింది అదానీకే.