న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలని గురువారం ఆదేశించింది. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీం కోర్టులో విజయం సాధించినందుకు ప్రతీకారంగానే ఈ నోటీసులు ఇచ్చారని ఆమ్ ఆద్మీ ఆరోపించింది.
కాగా, కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది ఏడోసారి. తనకు జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్ధమని పేర్కొన్న కేజ్రీవాల్ ఇంతవరకు జారీ చేసిన ఆరు నోటీసులను లెక్కచేయలేదు. ఒక్కసారి కూడా ఈడీ ముందు హాజరు కాలేదు. దీంతో తాము జారీ చేసిన సమన్లను పట్టించుకోని ఆయనపై ఈడీ ఇటీవల స్థానిక న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది. దీంతో గత వారం జరిగిన విచారణలో కేజ్రీవాల్కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చిన కోర్టు తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.