న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ప్రకటనపై ఎన్నికల సంఘం స్పందించింది. అది ఫేక్ మెసేజ్ అని స్పష్టంచేసింది. ఈ నెల 12 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఈసీ పేరిట కొందరు నకిలీ వార్తను ప్రచారం చేస్తున్నారు.
మార్చి 28 నుంచి నామినేషన్లు, ఏప్రిల్ 19న పోలింగ్, మే 22న ఫలితాలు ప్రకటిస్తారని అందులో ఉన్నది. అయితే ఇది ఫేక్ అని, తాము ఎలాంటి షెడ్యూల్ ప్రకటించలేదని ఈసీ స్పష్టంచేసింది.