భువనేశ్వర్: ఒడిశాలోని భద్రక్, పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ మధ్య దూరం 181 కిలోమీటర్లు. అయితే ఈ రెండు పట్టణాల మధ్య నడిచే ప్యాసెంజర్ రైలులో చార్జీ మాత్రం రెండు విధాలుగా ఉన్నది. ఒక ప్రయాణికుడు ఖరగ్పూర్ నుంచి భద్రక్ వెళ్లాలంటే రూ.40 అవుతుంది. అదే దూరం ఉండే భద్రక్ నుంచి ఖరగ్పూర్ వెళ్లాలంటే మాత్రం ఆశ్చర్యకరంగా దాదాపు రెట్టింపుగా రూ.75 టికెట్ తీసుకోవాల్సి వస్తున్నది.
కొవిడ్ సమయంలో పెంచిన రైలు చార్జీలను తర్వాత ఈస్టు కోస్ట్ రైల్వే అధికారులు సరిదిద్దకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఎస్ఈఆర్ అధికారులు పేర్కొన్నారు. దీనిపై ఈసీఆర్ అధికారులు స్పందిస్తూ.. ఈ అంశం పరిశీలనలో ఉన్నదని, రైలు చార్జీ మార్పుపై ప్రతిపాదనలను రైల్వే బోర్డుకు పంపామని అన్నారు.