న్యూఢిల్లీ, డిసెంబర్ 14: పార్టీల గుర్తింపు రద్దు తమ పని కాదని, అవి చట్టసభలు చూసుకుంటాయని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దేశంలోని కొన్ని పార్టీల పేర్లు కులం, మతం, జాతి, భాష అర్థాలతో ఉన్నాయని, కొన్ని పార్టీల గుర్తులు జాతీయ జెండా రంగులను పోలి ఉన్నాయని, వాటి గుర్తింపును వెంటనే రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై గురువారం ఢిల్లీ హైకోర్టు స్పందించింది.
వాటిపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలి తప్ప అది న్యాయస్థానాల పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ‘ఇవన్నీ విధాన నిర్ణయాలు. మేము చట్టాలను చేయం. దీనిపై పార్లమెంటే తగిన విధంగా స్పందించాలి’ అని జస్టిస్ మినీ పుష్కరణ అన్నారు.