యువతకు డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 27 : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన ఐదారు దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ జీ సతీశ్రెడ్డి అన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరిన్ని పరిశోధనలు చేసి దేశాన్ని అగ్రగామిగా నిలపాలని యువతకు పిలుపునిచ్చారు. విజయవాడలోని సూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆరిటెక్చర్ కళాశాల లో డీఆర్డీవో, విజ్ఞాన్ ప్రసార్ సంయుక్తంగా నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించి, విద్యార్థులతో మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో అర్జున్ యుద్ధట్యాంక్ను తయారు చేశామని చెప్పారు. ఖగోళ రంగంలో అమెరికా, చైనా, రష్యాలతో ఇస్రో పోటీ పడుతున్నదని, చం ద్రుడు, అంగారక గ్రహంపై పరిశోధనలకు చంద్రయాన్, మంగళయాన్లను చేపట్టామని వివరించారు. ప్లాస్టిక్ను నిర్మూలించాలనే ఉద్దేశంతో పర్యావరణ హితమైన బయోడిగ్రేడబుల్ బ్యాగ్లను డీఆర్డీవో రూ పొందించిందని గుర్తుచేశారు. పరిజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తామని, బ్యాగ్లను విరివిగా తయారుచేయాలని పిలుపునిచ్చారు.
అంకుర సంస్థలకు ప్రోత్సాహం
దేశంలో అత్యంత ప్రతిభావంతులైన యువత ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలుగా మారేందుకు ఆసక్తి చూపుతున్నారని సతీశ్రెడ్డి తెలిపారు. ఇటీవల 60 వేల స్టార్టప్లు ప్రారంభం కావడమే ఇందుకు నిదర్శనమని పేరొన్నారు. కొత్త ఆలోచనలతో అంకుర సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చే ఔత్సాహికులకు సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని చెప్పారు.