బెంగళూరు: కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఆయన కుటుంబాన్ని అంతమొందిస్తామని బీజేపీ చిత్తాపుర అభ్యర్థి మణికంఠ రాథోడ్ బెదిరించారని కాంగ్రెస్ పార్టీ శనివారం ఆరోపించింది. ‘రాజకీయాల రహస్య ప్రణాళికల్లోకి హత్యలు కూడా చేరాయి’ అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక ఎన్నికల ఇన్చార్జి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా వ్యాఖ్యానించారు.
సూర్జేవాలా ఆరోపణలపై కర్ణాటక సీఎం బొమ్మై స్పందించారు. ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకొంటామని, విచారణ జరిపిస్తామని, చట్టం తగిన చర్యలు తీసుకొంటుందని తెలిపారు.