న్యూఢిల్లీ: అగ్నివీర్లు.. సాధారణ సైనికులతో సమానం కాదని, ఇద్దరికీ ఒకే విధమైన ‘డెత్ బెనిఫిట్స్’ ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. పాకిస్థాన్ కాల్పుల్లో మరణించిన అగ్నివీర్ తల్లి దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయగా, పై విషయాన్ని దాంట్లో పేర్కొన్నది. సాయు ధ దళాల్లో ‘అమరవీరుడు’ అనే పదాన్ని ఉపయోగించరని కూడా కేంద్రం తెలిపింది. వారి కుటుంబ సభ్యులకు అందే పెన్షన్ ప్రయోజనాల విషయంలో సాధారణ సైనికులతో సమానంగా అగ్నివీర్లకు బెనిఫిట్స్ ఉండవని కేంద్రం బాంబే హైకోర్టుకు తెలియజేసింది.
గత ఏడాది ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్థాన్ సైన్యం జరిపిన మోర్టార్ దాడుల్లో పూంచ్లో మురళీ నాయక్ అనే అగ్నివీర్ వీరమరణం పొందాడు. స్వల్పకాలిక నియామక పథకం కింద చేరిన ‘అగ్నివీర్ల’ కుటుంబాలకు దీర్ఘకాలిక పెన్షన్, ఇతర సంక్షేమ ప్రయోజనాల్ని కేంద్రం నిరాకరిస్తున్నదని మురళీ నాయక్ తల్లి కోర్టును ఆశ్రయించింది.