హైదరాబాద్, ఫిబ్రవరి 1 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలకు బడ్జెట్లో కేంద్రం వరాలు కురిపించింది. తమిళనాడులోని ప్రఖ్యాత కాంచిపురానికి చెందిన చీరలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిచేయడం గమనార్హం.
ఇక తమిళనాడుకు అరుదైన ఎర్త్ కారిడార్లు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ లైన్లు, టూరిజం ప్రోత్సాహకాలు, పంటలకు మద్దతు పథకాలను ఇవ్వగా, బెంగాల్కు డెడికేటెడ్ ప్రైట్ కారిడార్, హైస్పీడ్ రైలు లింక్, ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్, పలు టూరిజమ్ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించింది. ఎన్నికల్లో ఓట్లను రాబట్టేందుకు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ఈ వరాలు కురిపించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.