న్యూఢిల్లీ : యాపిల్ ప్రొడక్ట్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఐఓఎస్, ఐపాడ్ఓఎస్, మేక్ఓఎస్, టీవీఓఎస్, వాచ్ఓఎస్, సఫారీ బ్రౌజర్ వంటి యాపిల్ ఉత్పత్తుల్లో అనేక బలహీనతలు వెల్లడైనట్లు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ-ఐఎన్) శుక్రవారం తెలిపింది. అటాకర్లు వీటిలోని సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఆర్బిట్రరీ కోడ్ను ఎగ్జిక్యూట్ చేయగలుగుతారని, భద్రతాపరమైన ఆంక్షలను పక్కనపెట్టి సమాచారాన్ని దొంగలించగలరని,సేవలను నిరాకరించే పరిస్థితులను సృష్టించగలరని, ఆథెంటికేషన్ను కూడా తప్పించుకుని చొరబడే అవకాశం ఉందని, స్పూఫింగ్ అటాక్స్ చేయవచ్చని కేంద్రం హెచ్చరించింది.